Friday, April 19, 2024

3వ తేది మ‌ధ్యాహ్నం 12.10కి అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం..

హైద‌రాబాద్ : ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అదే రోజు మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ అసెంబ్లీలో ప్ర‌సంగించ‌నున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. కాగా ఆరో తేదిన అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు.. అసెంబ్లీ లో ఆర్ధిక శాఖ మంత్రి హారీష్ రావు, మండ‌లిలో శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బ‌డ్జెట్ ప్ర‌సంగం చేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement