Saturday, April 20, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడు గవర్నర్‌ రవీంద్ర నారాయణన్‌ రవి దర్శించుకున్నారు. అంతకుముందు గ‌వ‌ర్గ‌న‌ర్ కు ఆలయ మహాద్వారం వద్ద అడిషనల్ ఈఓ(ఎఫ్‌ఏసీ) వీరబ్రహ్మ, ఆలయ అర్చకులు ఘ‌న‌ స్వాగతం పలికారు. ఆలయంలో ద్వజ స్తంభానికి ప్ర‌త్యేక‌ పూజలు చేసిన గవర్నర్ అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి.. తీర్థ ప్రసాదాలు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డీవైఈవో హరిద్రనాథ్, ఓఎస్డీ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement