Thursday, April 18, 2024

కనక దుర్గమ్మను దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి విచ్చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి దుశ్శాలువలతో సత్కరించి ఆశీర్వదించారు. అమ్మవారి దయతో నూతన ఏడాదిలో ప్రజలందరూ సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి, అమర నాధ రెడ్డి ఆకాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement