Wednesday, April 24, 2024

కేబినెట్‌లో ఏపీకి మొండిచేయి.. బీజేపీపై టీడీపీ నేత సెటైర్లు

కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. త్వరలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. కానీ ఏపీకి చెందిన బీజేపీ నేతలకు కనీసం సహాయ మంత్రి అవకాశం కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

‘ఓహో… అదిరిందయ్యా పుష్పములు. ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవనే విషయం అర్థమయింది’ అని గోరంట్ల ట్వీట్ చేశారు. కేవలం ఎన్నికలు, ఎంపీ సీట్లు, ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప… తెలుగు ప్రజలకి నిజంగా న్యాయం చేయాలనే తపన కేంద్ర ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప బీజేపీ మన వైపు చూడదన్నమాట అని విమర్శించారు.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రులు-వారి శాఖలు

Advertisement

తాజా వార్తలు

Advertisement