Friday, March 29, 2024

తెలంగాణలో గౌడన్నలకు శుభవార్త.. త్వరలో ఉచితంగా బైకులు

తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రెండు లక్షల మంది కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మొదటి దశలో 15 వేల మంది లబ్ధిదారులకు మోపెడ్ వాహనాలను అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

గౌడన్నలకు ఈ పథకం అమలు కోసం రూ.1,200 కోట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్ అనుమతి రాగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వంలో కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నేతన్నలకు పథకం పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. అలాగే ముదిరాజ్‌లకు ట్రాలీలను ఉచితంగా అందించింది. మరోవైపు దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: పూజా హెగ్డేపై వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement