Tuesday, March 26, 2024

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ల‌లో ప్ర‌త్యేక రైళ్లు..

ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ‌మ‌ధ్య‌ రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు జనవరి 27, 28 తేదీల్లో సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 27 సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు (07489) బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుతుందని, అలాగే తిరుపతిలో ప్రత్యేకరైలు(07490) జనవరి 28న బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్‌కు చేరుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement