Thursday, April 25, 2024

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. కొత్త ఫార్మాట్‌లో 2024 టీ20 వరల్డ్‌ కప్‌

అభిమానులకు మజా ఇచ్చేలా 2024 ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కొత్త ఫార్మాట్‌ వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది. 2024లో వెస్టిండీస్‌-అమెరికాలో జరగబోయే ఈ టోర్నీలో టైటిల్‌ కోసం ఏకంగా 20 జట్లు పోటీ పడనున్నాయి. దీంతో గత రెండు సీజన్లకు భిన్నమైన ఫార్మాట్‌లో జరుగనుంది. అంతేగాకుండా వచ్చే సీజన్‌లో క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లు ఉండవు. గ్రూప్‌నకు ఐదు జట్ల చొప్పున 20 జట్లను 4 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సూపర్‌-8లోకి అడుగుపెడతాయి. సూపర్‌-8లో మళ్లి 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక్కో గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

సూపర్‌-8కు వెళ్తాయి. ఈ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఆ తర్వాత గ్రూప్‌లోని టాప్‌ రెండు జట్లు సెమీస్‌ చేరతాయి. అంతిమంగా ఫైనల్‌ జరుగుతుంది. ప్రస్తుతానికి 12 జట్లు వచ్చే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో వెస్టిండీస్‌, అమెరికా జట్లకు నేరుగా బెర్త్‌ దక్కింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తోపాటు ఇటీవలి టోర్నీలో టాప్‌-8గా నిలిచిన పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌కు కూడా ఈ చాన్స్‌ దక్కింది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ఆధారంగా అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కూడా మెగా టోర్నీ ఆడనున్నాయి. మరో 8 స్థానాల కోసం రీజినల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ ఖండాలు రెండు క్వాలిఫికేషన్‌ స్పాట్‌లను కలిగి ఉండగా… అమెరికా, తూర్పు ఆసియా పసిఫిక్‌ ఒక్కో స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అర్హత ఆధారంగా ఎన్నికైన 8 జట్లు నాలుగు గ్రూపులలో రెండేసి చొప్పున ఆడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement