Thursday, March 28, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో – రూ.53.77ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

రూ.53.77ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయి నుంచి ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement