Friday, March 29, 2024

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయ‌గా.. సుధీర్‌ కుమార్‌ అనే వ్యక్తివద్ద బంగారం పేస్ట్‌ లభించింది. దాని విలువ 46.51 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement