Monday, March 25, 2024

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

పసిడి ప్రియులకు మరోసారి చేదువార్త. బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు ఇప్పుడు ఒక్కరోజే రూ.750 మేర పెరిగింది. దీంతో రూ.52,150 మార్కుకు చేరింది. ఇక ఇదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.820 మేర పెరిగి రూ.56,890 మార్కుకు పెరిగింది. దిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రూ.750 పుంజుకొని రూ.52,300కు చేరగా.. ఇదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,040 మార్కు వద్ద ఉంది. ఇక వెండి దిల్లీలో రూ.450 పెరిగి కిలోకు రూ.65,700 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1400 పెరిగి రూ.68,700 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా హైదరాబాద్‌తో చూస్తే దిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగా, సిల్వర్ రేటు తక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement