Thursday, April 18, 2024

అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తూ.. అనంత లోకాల‌కు.. బెంగాల్‌లో యాక్సిడెంట్​.. 18మంది మృతి..

కోల్‌క‌తా: బంధువు చావుక‌బురు విని… ఆఖ‌రి చూపు చూసొద్దామ‌ని 35 మంది ఓ ట్ర‌క్కులో వెళ్తుండ‌గా ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్ల‌వారుజామున 3 గం.ల స‌మ‌యంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక వైపునుంచి వేగంగా ఢీకొంది. ఈఘ‌ట‌న‌లో 12మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఆరుగురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న బెంగాల్ రాష్ట్రం న‌దియా జిల్లా హ‌న్‌స్క‌లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మ‌`తుల్లో ఆరుగురు మ‌హిళు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్‌, ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement