Thursday, April 25, 2024

Jodhpur : దైవ దర్శనానికి వెళ్తూ… ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి


దైవ దర్శనానికి వెళ్తూ.. రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజస్థాన్​ జోధ్​పుర్​లో జరిగింది. బొలెరో- ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చురూ నుంచి కారులో.. దైవదర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో అర్ధరాత్రి సుమారు ఒంటిగంటకు ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కు వెనక భాగాన్ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతులు.. విజయ్​ సింగ్​, ఉదయ్​ ప్రతాప్ సింగ్, మంజూ కన్వర్, ప్రవీణ సింగ్, దర్పన్​ సింగ్, మధుకన్వర్​ సింగ్​లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ముగ్గురిలో చైన్​ సింగ్​ అనే వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పవన్​ సింగ్, సంజూ కన్వర్​ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జోధ్​పుర్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement