Friday, March 29, 2024

సీజేఐ ఎన్వీ రమణ నివాసంలో ఘనంగా ఉగాది సంబరాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం నిర్వహించిన వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావు, పమిడిఘంటం నరసింహారావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన తెలుగు వారూ సంబరాల్లో పాల్గొన్నారు. గాయకులు కారుణ్య, సాహితీ సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement