Friday, April 26, 2024

HYD: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement