Friday, April 19, 2024

బాలిక‌కు డ్ర‌గ్స్ ఇచ్చి… ఆ పనిచేశాడు..

ప్ర‌భ‌న్యూస్ : స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ఓ కామాంధుడు 17ఏళ్ల బాలిక‌కు డ్ర‌గ్స్ ఇచ్చి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తీవ్ర‌ర‌క్త‌స్రావంతో యువ‌తి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనుప్పుర్ జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలిక ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు అదునుచూపి ఇంట్లోకి చొర‌బ‌డి బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. లైంగిక వాంఛ‌ను పెంచే అఫ్రోడిసియాక్ (డ్ర‌గ్స్) ఇచ్చి అత్యాచారం చేశాడు. శారీర‌కంగా చిత్ర‌హింస‌ల‌కు గురిచేశాడు.

ఈ నేప‌థ్యంలో బాలిక తీవ్ర‌ర‌క్త‌స్రావంతో అప‌స్మార‌క స్థితిలోకి చేరింది. భ‌యాందోళ‌న‌కు గురైన ఆ కామాంధుడు అక్క‌డి నుంచి పారిపోయాడు. ఇంటికి తిరిగొచ్చిన త‌ల్లిదండ్రులు, బాలిక అచేత‌నావ‌స్థ‌లో ప‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రిశీలించి చికిత్స అందిస్తుండ‌గానే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు న‌మోదు చేసి, పోస్టుమార్గం నిర్వ‌హించారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో చ‌నిపోయిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది. నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement