Friday, March 29, 2024

వడగండ్ల వాన నష్టంపై నివేదిక ఇవ్వండి.. కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఫోన్

సిరిసిల్ల, మార్చి 19 (ప్రభ న్యూస్) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాలంగా కురిసిన వడగండ్ల వర్షంతో కలిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ జయంతిని ఆదేశించారు. జిల్లాలో కురిసిన వడగండ్ల‌ వానతో జరిగిన నష్టం, పoట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పంట నష్టంపై త్వరితగతిన నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement