Wednesday, March 27, 2024

కుక్కల దాడిలో బాలికకు తీవ్ర‌గాయాలు.. నిర్మ‌ల్‌ జిల్లాలో ఘ‌ట‌న‌

కుక్కల దాడిలో బాలికకు గాయాల‌య్యాయి. ఈ ఘటన నిర్మ‌ల్‌ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఇవ్వాల (ఆదివారం) జరిగింది. మండల కేంద్రంలోని కొత్తగూడెంలో సాయంత్రం 7 గంటలప్పుడు హారిక (5) ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలిక కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను పెంబి హాస్పిటల్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖానాపూర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ వారం రోజుల్లో కుక్కల దాడి ఘ‌ట‌న‌లో ఇది రెండవ కేసు… ఇప్పటికైనా అధికరులు, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement