Thursday, April 25, 2024

‘టూలెట్’ పోస్టర్ అతికించినందుకు రూ.2వేలు జరిమానా

కొందరు తమ ఇళ్లలో అద్దె రూంలు ఖాళీగా ఉన్నాయని, కావాల్సిన వారు సంప్రదించాలని బహిరంగ ప్రదేశాల్లో ‘టూలెట్’ పోస్టర్లు పెడుతుంటారు. అలాంటి వారికి జీహెచ్ఎంసీ అధికారులు షాకిస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఇలాంటి పోస్టర్ల వల్ల కరెంట్ స్తంభాలు, గోడలు అందవికారంగా మారుతున్నాయంటూ ఓ సొసైటీ ఫిర్యాదు చేసింది. దీంతో జీహెచ్ఎంసీ విభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్అం డ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) రూ.2వేల జరిమానా విధించింది.

అయితే టూలెట్ పోస్టర్‌లో ఉన్న ఫోన్ నంబర్ గల వ్యక్తి చిరునామా నగరంలో లేదని, సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఇదని ఈవీడీఎం అధికారులు గుర్తించారు. ఇదే పిల్లర్‌పై యాక్ట్ ఫైబర్ నెట్ వారి వ్యాపార ప్రకటన కూడా ముద్రించబడి ఉండటం గమనార్హం. వారిపై ఏం చర్యలు తీసుకున్నారని అదే సొసైటీ ప్రశ్నించగా, ఈవీడీఎం అధికారుల నుంచి ఇంకా సమాధానం రాకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement