Friday, April 19, 2024

ప్రభుత్వంతో కలిసినడవండి.. ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఆర్ధిక మంత్రి సూచన

ఫిన్‌టెక్‌ సంస్థలు నమ్మకాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వంతో, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పని చేయూలని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కోరారు. దూరాన్ని తగ్గించుకునేందుకు అడ్డంకులను అధిగమించాలని, ప్రభుత్వంతో కలిసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వం, రెగ్యులేటర్స్‌, ఇండస్ట్రీలో నమ్మకాన్ని పెంచుకునేందుకు ఇది అవసరమని చెప్పారు. ఫిన్‌టెక్‌ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగితే ఇబ్బందులు వస్తాయని, అందుకే దాన్ని బ్రేక్‌ చేయాలని కోరారు. ప్రభుత్వంతో మరిన్ని ఎక్కువ కార్యకలాపాలు జరపాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement