Wednesday, April 17, 2024

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు.. రుచి, సువాసనతోపాటు మెండుగా పోషకాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తాండూరు కంది పంటకు భౌగోళిక గుర్తింపు దక్కింది. నాణ్యతాపరంగా తాండూరుకందికి విశిష్ట లక్షణాలు ఉంటాయి. రుచి, సువాసన, పోషకాలు మెం డుగా ఉన్నీ కంది పప్పుకు దేశ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. తాండూరు నేలల స్వభావం, భూమిలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రాదాయ, ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ఈ కందికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లో లక్షా48వేల ఎకరాల్లో కంది సాగువుతోంది. ఇప్పటి వరకు దేశ మంతటా భౌగోళిక గుర్తింపుకోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు రాగా అందులో 4342 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు దక్కింది.
ఆజాదికా అమృత్‌ ఉత్సవాల్లో భాగంగా 75 ఉత్పత్తుల వివరాలను జీఐ జర్నల్‌లో ప్రచురించారు. గత ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 9 ఉత్పత్తులకు మాత్రమే ఈ గుర్తింపుదక్కింది. అందులో తాండూరు కంది ఒకటి కావడం గమనార్హం.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు రాగా… పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్‌ ఢోక్రా, వరంగల్‌ డురీస్‌(2018), నిర్మల్‌ పెయింటింగ్‌ (2019), తాండూరు కంది (2022) గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి. అందులో మామిడి, కంది ఉద్యాన, వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావడం విశేషం. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకత. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని తేలింది. దేశంలోని ఢిల్లి, ముంబయి, కోల్‌కత్తాల్లో తాండూరు కంది బ్రాండ్‌కు మంచి డిమాండ్‌ ఉంది.

యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం, తాండూరు కంది పరిశోధనా స్థానం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయడంతో ఈ అరుదైన గుర్తింపు దక్కింది. తాండూరు కందికి భౌగోలిక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ విద్యాలయ సంచాలకులు డాక్టర్‌ జగదీశ్వర్‌, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ను అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్ర వేత్తలను సన్మానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement