Wednesday, April 24, 2024

మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌!! గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌ ప్రతినిథి : ఎవరైనా విన్నారంటే చెవులు మూసుకోవాల్సిందే? ఏమైనా మాట్లాడాలంటే మాటలు రాక మూగపోవాల్సిందే?. అభం శుభం తెలియని ఓ మైనర్‌ బాలికపై ఓ ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులు కూడా మైనర్లే. మరొకరు మేజర్‌ వ్యక్తి మైనర్‌ బాలికకు స్వయాన బాబాయి వరుస బంధువు అని సమాచారం. సభ్యసమాజం తలవంచుకునే ఈ సంఘటన జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామం. అత్యాచారం జరిగి సుమారు 5నెలలు అయింది. ఆ మైనర్‌ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు.

కానీ వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆ మైనర్‌ బాలిక ఇటీవలే ప్రభుత్వ విద్యాసంస్థలో ఆరవ తరగతిలోకి ప్రవేశం పొందినట్లు తెలిసింది. ఇద్దరు మైనర్‌ బాలురు, ఓ మేజర్‌ వ్యక్తి కలిసి గత కొద్ది నెలల క్రింద అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలికి గర్భం దాల్చింది. పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ బాలికలను మహబూబాబాద్‌లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ కేసు విషయమై పోలీసులు పెదవి విప్పడంలేదు. విచారణ చేపడుతున్నామని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని మాత్రమే పోలీసులు చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement