Friday, April 19, 2024

అమెరికాలో కాల్పుల కలకలం… నలుగురు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరోవైపు పోలీసులు కాల్పుల్లో ఓ అనుమానితుడు మరణించాడు. తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లీలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నది. కాల్పుల్లో మృతి చెందిన బెంటన్‌ కౌంటీనే ఫైరింగ్‌కు పాల్పడి ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్‌లో పోలీసులకు లభించింది.

వాహనం లోపల నుంచే కాల్పులు జరిపినట్టుగా తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టుగా కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ చెప్పారు. నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాలిపోయిన ట్రక్కులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రెండు మృతదేహాలను మరో ఇంట్లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ సాగుతుందని కెన్నెవిక్ పోలీసులు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement