Friday, March 29, 2024

మహేష్ బ్యాంక్ స్కామ్ కేసులో మరో నలుగురు అరెస్టు

మహేష్ బ్యాంక్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. యూపీ, పశ్చిమ బెంగాల్, ముంబైకి చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నైజీరియన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, మహారాష్ట్రలో నిందితుడు నైజీరియన్ కోసం పోలీసుల వేటాడుతున్నారు. ఈ దోపిడీ చిక్కుముడిని విడగొట్టేందుకు సీసీఎస్‌ పోలీసులు బ్యాచ్‌ల వారీగా విడిపోయి రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఈరోజు మ‌రో న‌లుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement