Saturday, April 20, 2024

రణిల్‌ మంత్రి వర్గంలోకి నలుగురు..

కొలంబో : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ విక్రమసింఘే తన క్యాబినెట్‌లోకి నలుగురిని చేర్చుకున్నారు. ప్రధాన విపక్షంసహా ఇతర పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు ససేమిరా అన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అధికారపక్షానికి చెందిని జి.ఎల్‌.పెరిస్‌ విదేశాంగ శాఖ మంత్రిగా, దినేష్‌ గుణవర్ధనే ప్రజాపరిపాలనాశాఖ మంత్రిగా, ప్రసన్న రణతుంగ పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా, కాంచన విజేశేఖర విద్యుత్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ త్వరితగతిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రయత్నిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement