Thursday, March 28, 2024

ఏపీలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన అభ్యర్థుల జాబితా

ఏపీ శాసనమండలిలో గవర్నర్ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు శుక్రవారం ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ఆయా సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం నలుగురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లా నుంచి ఆర్వీ రమేష్ యాదవ్, తూర్పు గోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులతో ఆయా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ఇప్పటికే గవర్నర్ హరిచందన్‌కు ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం గవర్నర్ ఈ ఫైలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement