Wednesday, April 24, 2024

ఉప్పల్ డబుల్ మర్డర్ కేసులో నలుగురు అరెస్ట్..

హైదరాబాగ్ నగరంలోని సంచలనం సృష్టించిన ఉప్పల్ డబుల్ మర్డర్ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో తండ్రి, కొడుకుల డబుల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్‌లో ఎనిమిది ఎకరాల భూ వివాదమే హత్యకు కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తు కోసం 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 30 మందిని విచారించిన పోలీసులు.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా హత్యకు హంతకులు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గరు సభ్యుల సుపారీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement