Thursday, April 18, 2024

Breaking : శ్రీకాకుళం జిల్లాలో విదేశీ డ్రోన్‌ కలకలం..

శ్రీకాకుళం జిల్లాలో సుముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ కలకలం రేపింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓ డ్రోన్‌ తిరుగుతూ మత్స్యకారుల కంటపడింది. దీంతో వారు ఆ డ్రోన్‌ను పట్టుకుని మెరైన్‌ పోలీసులకు అప్పగించారు. ఈ డ్రోన్‌ 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువున్న ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్‌ చిన్నపాటి విమానాన్ని పోలిఉంది. మలటరీ డ్రోన్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ డ్రోన్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో విచారిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతను పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు సైతం శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement