Tuesday, April 16, 2024

Follow up : కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

విడాకుల వివాదం హత్యకు దారితీసింది. కోర్టులోనే భార్యను గొంతుకోసి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హసన్‌ జిల్లా హోలె నరసిపురలో వెలుగుచూసింది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న క్రమంలో వారిద్దరు ఫ్యామిలీ కోర్టుకు కౌన్సిలింగ్‌ నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో కొడవలితో సదరు వ్యక్తి భార్య గొంతుకోశాడు. వెంటనేఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించింది. విచిత్రమేమిటంటే ఈ ఘాతుకానికి కొద్ది నిముషాల ముందువీరిద్దరు సయోధ్యకు అంగీకరించారు. ఏడేళ్ల వివాహ బంధాన్ని కొనసాగించడానికి సమ్మతించారు.

కొద్దిసేపటి తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌కు వెళ్లిన భార్య చైత్రను వెళ్లడించి శివకుమార్‌ దాడిచేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడున్నవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. శివకుమార్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులోకి ఆయుధంతో ఎలా ప్రవేశించాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement