Thursday, April 25, 2024

ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌వేసి – నివాళుల‌ర్పించిన మంత్రి ఎర్ర‌బెల్లి

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ..హనుమకొండ లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు …అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.. విశ్వ విఖ్యాత నటుడిగా, ఆ తర్వాత పరిపాలకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని..పేదల పెన్నిధి..రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు..ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత..వారి సేవలు చీర స్మరనియం..వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని ఎర్ర‌బెల్లి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement