Friday, April 19, 2024

వ‌ర‌ద బాధితుల‌కి చంద్ర‌బాబు ఏం ఇస్తారు.. మంత్రి పెద్దిరెడ్డి..

వ‌ర‌ద బాధితుల‌ని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. వరద నష్టం అంచనా వేస్తున్నామని…ఇది ప్రకృతి విపత్తు అని పెద్ది రెడ్డి అన్నారు. ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది తప్ప, ఇందులో ఎవరి తప్పులేదన్నారు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తమపై విమర్శలు చేస్తున్నాడ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం లేదని…తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు నాయుడు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇప్పుడేమిస్తావో ఆయన చెప్పాలి..అంటూ చంద్రబాబు ను పెద్ది రెడ్డి నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement