Thursday, April 25, 2024

కవితకు మద్దతుగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు.. నిజమైన రంగులు వెలిసిపోవంటూ కొటేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా శనివారం హైదరాబాద్‌ నగరంలో ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజకీయాలపై పోస్టర్లలో పేర్కొన్నారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టులు వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతల ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్‌ జరగగానే… కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో ఆరోపించారు.

ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ, పశ్చిమబెంగాల్‌ బీజేపీ ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీకి చెందిన వ్యాపారవేత్త సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌రాణ ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్‌ కి ముందు, తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారనే అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. నిజమైన రంగులు వెలిసిపోవు అంటూ పోస్టర్‌పై రాశారు. నగరంలోని పలు చోట్ల ఈ పోస్టర్లు వెలవడం ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌ చివర్లో బై బై మోదీ అనే హాష్‌టాగ్‌ సైతం ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement