Saturday, April 20, 2024

ఇంత దారుణ‌మా .. కారులోనే హ‌త్య .. ఏం జ‌రిగింది ..

ఓ ప్లాట్ రిజిస్ట్రేష‌న్ కోసం వెళ్ళిన వ్య‌క్తి దారుణ హ‌త్య‌కి గుర‌య్యాడు. ఈ సంఘ‌ట‌న అల్వాల్ లో చోటు చేసుకుంది. రియ‌ల్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ రెడ్డిని అగంత‌కులు దారుణంగా హ‌త‌మార్చారు. తిరుమ‌ల‌గిరిలో ఆయ‌న మృత‌దేహం ల‌భ్య‌మ‌యింది. నిన్న ఉదయం పది గంటలకు ఇంట్లో నుంచి వెళ్లినట్టు విజయభాస్కర్ రెడ్డి కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఆయ‌న పది లక్షలు తీసుకెళ్ళార‌న్నారు. అయితే కారులోనే కత్తితో మెడపై పొడిచి దుండగులు హ‌త‌మార్చిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ లో మధ్య‌వర్తులే ఆయ‌న‌ను చంపినట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్ప‌టికే ఇద్దరు అనుమానితులను తిరుమ‌ల‌గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహం పై కుటుంబ సభ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement