Thursday, April 25, 2024

గద్వాల జిల్లాలో విషాదం.. వర్షానికి గోడ కూలి ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా అయిజా మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున గోడ కూలీ ఐదుగురు మృతిచెందారు. గ్రామానికి చెందిన మోష శనివారం రాత్రి తన భార్య, ఐదుగురు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గుడిసె గోడ కూలింది. దీంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో మోష, మోష భార్య శాంతమ్మ, కుమారులు చరణ్, తేజ, రాము ఉన్నారని, స్నేహ, చిన్ని గాయపడ్డారని తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెప్పారు. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement