Thursday, April 18, 2024

వైష్ణోదేవి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రీసి జిల్లాలో కొలువైన వైష్ణోదేవి ఆలయంలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో క్యాష్ కౌంటర్ కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 గంటలకల్లా మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదం కారణంగా దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆలయ బోర్డు సీఈవో తెలిపారు. ప్రమాదంలో కొంత నగదు, రికార్డులు కాలిపోయినట్టు చెప్పారు. ఈ ప్రమాదం దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement