Friday, March 29, 2024

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హర్‌కేశ్‌ నగర్‌లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్‌ గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 18 ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘మా’ కోసం మనమందరం: మంచు విష్ణు మ్యానిఫెస్టో విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement