Friday, March 29, 2024

రేణిగుంట‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా డాక్టర్ మృతి..

తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్‌ మొత్తానికి విస్తరించాయి. ఆస్పత్రి భవనంలోనే ఉంటున్న డాక్టర్‌ రవిశంకర్‌ రెడ్డి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్ లో మొత్తం 5 మంది ఉన్నారు. ఆసుపత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసముంటోంది. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఇద్దరు చిన్నారులు సిద్దార్థరెడ్డి, కార్తిక సహా డాక్టర్ రవిశంకర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ భార్య, తల్లిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement