Thursday, April 25, 2024

టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా.. ఖండించిన కేంద్రం

నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్ చేతిలోకి వెళ్లిందని మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్రం ప్ర‌భుత్వం ఖండించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌కు దక్కిందని ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. దీనిపై స్పందించిన కేంద్రం.. ఎయిరిండియా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణలో ఆర్థిక బిడ్లను ప్ర‌భుత్వం ఆమోదించింద‌న్న మీడియా వార్త‌ల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీనిపై నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు ప్ర‌భుత్వమే మీడియాకు వెల్ల‌డిస్తుంద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement