Thursday, March 28, 2024

పేద క్రికెట్ క్రీడాకారునికి- ఉప్పల ఫౌండేషన్ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం

తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికై ..ఈ నెల 30న నేపాల్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన గంధమల్ల కరుణాకర్ నేపాల్ వెళ్లేందుకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేసిశారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..ఉప్పల ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు చెందిన అన్ని రంగాల వారికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తుందని నేపాల్ లో జరుగుతున్న క్రికెట్ పోటీలో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా క్రీడల్లో రాణించి విజయం సాధించాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత క్రీడా రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందించి ..వారికి సహాయ సహకారాలు అందిస్తున్నార‌న్నారు. ఈ కార్యక్రమంలో జివి. రమణరావు, రవీందర్ రెడ్డి, జి. యాదగిరి, లింగాస్వామి, దుర్గారెడ్డి, సబ్బం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement