Thursday, April 18, 2024

భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి.. ఐదుగురు పిల్ల‌ల‌తో బావిలోకి దూకి మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

జైపూర్: ప‌చ్చ‌ని సంసారంలో ఆర్థిక స‌మ‌స్య‌లు చిచ్చుపెట్టాయి. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. దీంతో విసిగివేసారిన ఆ మ‌హిళ త‌న ఐదుగురు పిల్ల‌ల‌తో క‌లిసి బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న శ‌నివారం రాత్రి రాజ‌స్థాన్ రాష్ట్రం కోటా జిల్లా కాలియాఖేడి గ్రామంలో చోటుచేసుకుంది. శివ‌లాల్‌తో బాద‌వ్ దేవీకి 15ఏళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ఐదుగురు పిల్ల‌లు. భార్యాభ‌ర్త‌లు ఎంతో అన్యోన్యంగా జీవితం గ‌డుపుతూ వ‌చ్చారు.

ఓ వైపు పిల్ల‌లు పెరిగి పెద్ద‌వార‌వుతుండ‌టం… ఇంట్లో ఖ‌ర్చులు పెరిగిపోవ‌డం… వెర‌సి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. శివ‌లాల్ తాగుడుకు బానిస‌య్యాడు. తాగొచ్చి భార్యను శారీర‌కంగా హింసించేవాడు. ఈ బాధ‌లు ఇక భ‌రించ‌లేనంటూ త‌న ఐదుగురు పిల్ల‌ల‌తో క‌లిసి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు గ్రామానికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికితీసి, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement