Saturday, April 20, 2024

కర్నూలు జిల్లాలో ఒకరికొకరు తన్నుకున్న సీఐ, లాయర్

కర్నూలు జిల్లా డోన్‌లో ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ, లాయర్ ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. ఇంటి దగ్గర వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు లాయర్లు వచ్చారు. అయితే వివాదాన్ని సీఐకి వివరించే క్రమంలో… సీఐకి, లాయర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటకు వచ్చిన లాయర్‌పై పోలీసులంతా కలిసి మరోసారి దాడి చేశారు. ఈ ఘటన పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement