Wednesday, April 24, 2024

సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బందికి కరోనా…

దేశంలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కంటే కూడా వేగంగా సోకుతోంది. దాంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వరుసగా ఆరో రోజూ కరోనా కేసులు లక్ష దాటాయి. ఇక ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. తాజా కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి. కాగా, శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement