Saturday, April 20, 2024

24 గంటల్లో 1500 పాజిటివ్ కేసులు – లాక్ డౌన్ పెట్టాల్సిందేనా ?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1498 కేసులు నమోదయ్యాయి. అయితే 1866 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందారు.

తాజాగా నమోదైన కరోనా కేసులు తో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,14,737 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అలాగే 1729 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని 3,03,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9993 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement