Thursday, April 18, 2024

అర్ధరాత్రి ఇనుపరాడ్లతో వీరంగం..

కృష్ణా జిల్లాలో కొంత మందరి యువకులు ఆరాచకం సృష్టించారు. అర్ధరాత్రి ఇనుపరాడ్లతో వీరంగం చేశారు. కంచికచర్ల పట్టణం గొట్టుముక్కల రోడ్డులో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. వదిలేయండి అంటూ ప్రాధేయ పడిన విడిచి పెట్టకుండా వెంటాడి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చీకటిలో కొట్టారు.  తలపై తీవ్ర గాయం కావడంతో బాధితుడు నాగబాబు విలవిలలాడాడు. పోలీసుల రాకతో గుర్తుతెలియని వ్యక్తులు పరారైయ్యారు. 108 వాహనంలో నాగబాబును నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement