Saturday, April 20, 2024

నైటీలు ధరించి దొంగతనాలకు వచ్చిన దుండగులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామశివారు ముత్యాలమ్మ తండాలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళలు ధరించే నైటీలు ధరించి వచ్చిన దుండగులు తండాకు చెందిన దరావత్ కవిత, బానోతు రామబాలు, చంద్రు, భూక్య లింగమ్మ ఇంట్లో చోరీ చేశారు.

ఓ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ గొంతే నొక్కి మెడలోని పుస్తెల తాడు కోసం వెతికారు. అయితే ఆ మహిళ గట్టిగా అరవడంతో దొంగలు సైకిల్ తొక్కుకుంటూ పరారయ్యారు. అంతకుముందే దొంగలు అదేగ్రామంలో ఓ కిరాణాషాపులో కూడా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కె.సముద్రం పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పురుషులే నైటీలు వచ్చి చోరీలకు పాల్పడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో వాగులోకి దూసుకెళ్లిన కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement