Thursday, April 25, 2024

కామారెడ్డి: కిలిమాంజారో పర్వతాన్ని ఎక్కిన తండ్రీకూతుళ్లు

ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తుగా ఉండే కిలిమాంజారో పర్వతాన్ని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన తండ్రి, ఆయన కుమార్తె అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. తిరునగరి శ్రీకాంత్, ఆయన కూతురు హిమలేఖ్య కిలిమాంజారో పర్వతం గిల్మన్ 5,685 మీటర్ల పాయింట్‌ను అధిరోహించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వీరిని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. ఈ మేరకు వారికి ఓ లేఖను పంపారు. ‘ధైర్యంతో, దృఢ సంకల్పంతో కష్ట సాధ్యమైన అరుదైన ఘనత సాధించిన తండ్రి, కుమార్తెలు తెలంగాణ వాసులు కావడం గర్వకారణం. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించే దిశగా మున్ముందు మరిన్ని అద్భుతాలు సాధించాలి’ అంటూ దత్తాత్రేయ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా శ్రీకాంత్, హిమలేఖ్యలకు తెలంగాణ వాసులు, స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement