Thursday, April 25, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో జరిగింది. ముంబైలోని చెంబూర్‌లో గల ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగు ప్ర‌యాణంలో ముంబై-పుణె హైవేపై కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బస్సుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement