Friday, April 26, 2024

Road Accident : ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి..

హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌ యశోద దవాఖానకు తరలించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement