Wednesday, April 24, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి..

జమ్ముకశ్మీర్‌లో జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మ‌ణం చెందారు. బుధవారం కథువా జిల్లాలో కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవ‌డంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement