Thursday, April 25, 2024

Big Breaking | న‌ల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి, మ‌రో ఐదుగురికి సీరియ‌స్‌

హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోరం జ‌రిగింది. కట్టంగూరు శివారులో ఎరసానిగూడెం వద్ద యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే చ‌నిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. వారి ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉంది. గాయాలైన వారిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఇక చ‌నిపోయిన వారిలో ఎండి ఇద్దాక్ (21), ఎస్ కే.సమీర్ (21), ఎస్ కే.యాసీన్ (18)గా గుర్తించారు. వీరంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

కాగా, హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తాకొట్టింది. ఇందులో ముగ్గురు చనిపోయారు. కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. మృతులంతా ఖమ్మం ఖిల్లా బాఘ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement