Saturday, March 23, 2024

పులిమడుగు వ‌ద్ద‌ ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ఉట్నూర్‌, ప్రభన్యూస్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని పులి మడుగు సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఉట్నూర్‌కు చెందిన కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షులు షాహబాజ్‌(25), గాయక్వాడ్‌ రవి(23), రాథోడ్‌ మోహన్‌(19) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు బైక్‌లపై వెళుతుండగా ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. షహబాజ్‌, రవిలు ఆదిలాబాద్‌ నుంచి బైక్‌పై ఉట్నూర్‌ వస్తుండగా ఎదురుగా బైక్‌పై వెళుతున్న రాథోడ్‌ మోహన్‌, అశోక్‌లు ఢీకొట్టుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ముగ్గురు మృతి చెందగా అశోక్‌ అనే యువకునికి తీవ్రగాయాలై పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తెలియగానే ఉట్నూర్‌ సిఐ సైదారావ్‌, ఎస్సై భరత్‌ సుమన్‌ చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఉట్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. పంచనామా చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై భరత్‌ సుమన్‌ తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోడ్డుపై మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement